24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14
—పంతులు బాగున్నారా
హరి పంతులును పరమర్శించిన ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి
మర్కుక్; పంతులు బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని పాములపర్తి కి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు హరి పంతులును ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి ఆత్మీయంగా పరామర్శించారు..అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకొని ఎమ్మెల్సీ డా వంటేరు యాదవ రెడ్డి తో కలిసి ఆయన స్వ గృహంలో పరామర్శించారు..ఆయన ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.. వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మొర్సు కర్ణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు..





