ప్రాంతీయం

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. కనీస వేతనాలు పెంచాలి…

335 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 12 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని వివిధ గ్రామంలో గ్రామీణ నీటిశౌర పౌరశాఖ వాటర్ సప్లైకార్మికులు పంప్ ఆపరేటర్ లు గత అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలు ఇచ్చి ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయన్నారు. కనీస వేతనాలు రూ. 21. వేలకు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 30. సంవత్సరాల నుండి మావేతనం 300 లతో మొదులుకొని 9,500 వరకు చేస్తున్నాము కానీ నిత్యవసర వస్తువులు అనుగుణంగా అట్టి వేతనము సరిపోవడంలేదు పొగ మేము ఉదయము వేకువజామున నాలుగు గంటలనుండి సాయంత్రం 8,గంటల వరకు విధినిర్వహణలో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్నాం మాకు శనివారము ఆదివారము పండుగలకు సెలవుదినములు ప్రకటించాలి. మా సందేశమును సుదీర్ఘంగా ఆలోచించి ప్రతిదినము 8,గంటలు విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని మాయొక్క డిమాండును అంగీకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండుగారి పోచరాములు, ఉపాధ్యక్షులు పిల్లి రాజు, ప్రధాన కార్యదర్శి అబ్రవీని లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మీస సుధాకర్, పొన్నాల బాబు, జక్కుల రవీందర్, కోనేటి దేవయ్య, దొమ్మాట రాజు, ఎండిహరీష్ నరసయ్య పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found