ముస్తాబాద్, ఏప్రిల్ 11 (24/7న్యూస్ ప్రతినిధి): పోలీస్ స్టేషన్లో రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్సై కే. శేఖర్ రెడ్డిలు బాధితుడికి సెల్ ఫోన్ అప్పగించారు. బాధితుడిది దుబ్బాక మండలం లచ్చపేటకు చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తేదీన సెల్ఫోన్ పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో సెల్ ఫోనువెతికి అప్పగించడం జరిగిందని సిఐతెలిపారు. సిఐతోపాటు సిబ్బంది ఉన్నారు ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు.
