ప్రాంతీయం

బెల్లంపల్లిలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

109 Views

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి

బెల్లంపల్లి లో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు ,బెల్లంపల్లిలో,ఒకవైపు ప్రజలు నీటి కోసం అల్లాడుతుండగా మరో వైపు మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీ అయి నీరు వృథాగా పోతోంది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, బెల్లంపల్లి బస్తీలోని, 19 వార్డ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏరియాలో మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీ అయి నీరు సరఫరా అయిన రోజు గంటకు పైగా నీరంతా వృధా అవుతుంది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీరు లీకేజీకాకుండా చూడాలని పిల్లలు ముసలి వాళ్లు వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found