బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి
జీవితకాలం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి
నిత్యం ప్రభుత్వాలతో అంతర్గతంగా కొట్లాడి
భారత రాజ్యాంగాన్ని కాపాడిన బాబు జగ్జీవన్ రామ్
కార్మిక మంత్రిగా ,భారతదేశం యొక్క మొదటి క్యాబినెట్ మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడు కూడా అయ్యాడు , అక్కడ అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు.
ఏప్రిల్ 5
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి బి డి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ , సాడిమేల డేవిడ్ లు మాట్లాడుతూ ఏప్రిల్ మాసం ఏప్రిల్ ఫూల్ మాసం కాదు అని ఇది మహానీయుల మాసం వారోత్సవాలు జరుపుకునే మాసంగా ఉంటుందని అదేవిధంగా బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు మరియు అసాధారణ ప్రతిభావంతుడైన వక్త. అతను మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు మరియు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు, భారతీయ రాజకీయాల్లో అర్ధ శతాబ్దానికి పైగా నిబద్ధత, అంకితభావం మరియు భక్తితో విస్తరించాడు. బాబూజీ ఇంద్రాణి దేవిని జూన్ 1935లో వివాహం చేసుకున్నారు. ఇంద్రాణి దేవి స్వయంగా స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు విద్యావేత్త. ఆమె తండ్రి డాక్టర్ బీర్బల్, ప్రఖ్యాత వైద్య నిపుణులు, బ్రిటీష్ సైన్యంలో ఉన్నారు మరియు 1889-90 నాటి చిన్-లుషాయ్ యాత్రలో చేసిన సేవలకు గాను అప్పటి వైస్రాయ్ లార్డ్ లాన్స్డౌన్ ద్వారా విక్టోరియా మెడల్ను అందుకున్నారు. వారికి 17 జూలై 1938న కుమారుడు సురేష్ కుమార్ మరియు 1945 మార్చి 31న కుమార్తె మీరా జన్మించారు. సురేశ్ కుమార్ 21 మే 1985న కన్నుమూశారు, తను బ్రతికి ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశాడని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో బి డి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ,మురళీకృష్ణ. గాలి, రాజేష్. బీఎఫ్ టు యు జిల్లా కన్వీనర్ శ్రీనివాస్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.





