తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 02
గుగులోతు వీరన్న వాల్య తండా, దంతాలపల్లి మండలం, తొర్రూర్ డివిజన్, మహబూబాద్ జిల్లా వాసి,స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యుడు అకాల మరణానికి చింతిస్తూ,
ఆ సంఘం సభ్యులు తోటి సభ్యురాలైన డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలు గుగులోతు జ్యోతి ని,వారి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగినది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామ్ చందర్ మాట్లాడుతూ రోజువారి కూలీగా జీవనం కొనసాగిస్తున్న అడ్డాల మీద రోజు కూలి కోసం ఎదురుచూసే అన్ని కుటుంబాల లాగానే వీరన్న కుటుంబం కూడా ఒకటి,
వీరన్న తన భార్య జ్యోతి మా సంఘం సభ్యులు ఈ విషయము తెలుసుకున్న మా డివిజన్ కమిటీ అధ్యక్షులు గద్దల అంజిబాబు,డివిజన్ మెంబర్లు మండల అధ్యక్షులు చిన్నాల స్వామి మెంబర్లు మహంకాళి రవి, రాంపాక రమేష్, బందు యాకన్న, డివిజన్ నెంబర్ పవన్ కళ్యాణ్,
సూక్య నాయక్ అమ్ములు మొదలగు వారు పాల్గొని వీరన్నకు అంతిమ వేడుకోలు పలికారు.
