మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాములు చెరువు కట్ట పైన వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణ లో ఉదయం పూట వాకింగ్ కు వచ్చే వాకర్స్ కు ఎండాకాలం పూట దాహార్తిని తీర్చడానికి రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బూర్ల జ్ఞాని సహకారంతో ఈరోజు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ మరియు సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య ఉపాధ్యక్షులు భాస్కరరావు రాజేందర్ రెడ్డి,ఎక్సైజ్ సీఐ గురవయ్య ,డా. త్రినాధరావు, లక్ష్మణ్, సందీప్,రావుల ప్రతాపరెడ్డి,జూపాక సుధీర్, లక్ష్మి నారాయణ గౌడ్, రమణ,కార్యవర్గ సభ్యులు కిరణ్ శంకర్ కళ్యాణ్ జి తిరుపతి,గుండ శ్రీధర్,S.గోపి తదితరులు పాల్గొన్నారు.
