ప్రాంతీయం

బెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

80 Views

బెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజి రెడ్డి

బెదిరింపు చర్యలు సహించలేరని డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి శనివారం రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రామకృష్ణపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలువల శ్రీనివాస్ అనే మార్పు పేపర్ దినపత్రిక విలేఖరి డి జె ఎఫ్ సభ్యుడైన కొండ శ్రీనివాసు ను బెదిరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ కేతనపల్లి సమస్యను వ్యక్తిగతంగా తీసుకొని ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ డి జె ఎఫ్ సభ్యుడుని బెదిరించడం సరికాదని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా డి జె ఎఫ్ యూనియన్ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రెస్ క్లబ్ సమస్యలు ఏమైనా ఉంటే సమరసింగ పరిష్కరించుకోవాలని అంతేగాని ఇటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్, జిల్లా కోశాధికారి సతీష్, జిల్లా అధికార ప్రతినిధి ఆనపర్తి కుమార్, క్యాతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పిలు మాల్ల గట్టయ్య, నాంపల్లి గట్టయ్య, మరో రవీందర్, నెల్లూరి శ్రీనాథ్, రామస్వామి , ప్రసాద్, ఈశ్వర్, గంగులు, పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్