(తిమ్మాపూర్ మార్చి 21)
తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు గురువారం సందర్శించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు పరిశీలించారు.
ఎన్నికల సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు రహదారి సౌకర్యం అనువుగా ఉన్నదీ లేనిది పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా ఉందన్నారు.