ప్రాంతీయం

అన్నదాతల ఆశలు ఆవిరి… అధైర్య పడవద్దు వినోద్ కుమార్

95 Views

ముస్తాబాద్, మార్చి 19 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో కురిసిన అకాల వడగండ్ల వానకు ముస్తాబాద్ పోతుగల్ తో పాటు పలు  గ్రామాలలో వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు కలిసి వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ క్రమంలో రైతులు బోరున విలపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వినోద్ కుమార్ నేతలకు తెలిపారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించాలని కోరుతామని రైతులకు తెలిపారు. రైతులు అప్పుచేసి పంటలే ఎండిపోయి నూతన బోర్లువేసి చేతికందే పంట ఆకాలవర్షం ద్వారా పూర్తిగా ఊడ్చుక పోయిందని అన్నారు. అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు పుష్కలంగా సాగు నీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండే విధంగా చూశాయని ప్రస్తుత ప్రభుత్వం పంటకు సాగునీరు ఇవ్వక ఒకవైపు కొంత మేరకు ఎండిపోయిన సందర్భంలో మరోవైపు ప్రకృతి వైపరీత్యాలవల్ల అకాల వడగండ్లు వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కాలేశ్వరం నీరు అందించిందని రైతులు తెలపడం దీనికి నిదర్శమని రైతులు ఆధైర్య పడవద్దని ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అందజేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 15వేలు నుండి 20వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్ రావు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. కల్వకుంట్ల గోపాల్ రావు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి. మాజీ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్. మాజీ టిఎస్పిఎస్సి సభ్యులు ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు. మాజీ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు. సర్వర్ పాషా కార్యకర్తలు నాయకులు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.


 

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్