తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 18
???? *ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు*
???? *రాయితీ ప్రకటనతో వసూల్ పై ఆశలు*
???? *డప్పులతో వసూలు*
???? *సీజ్ చేసిన అధికారులు*
???? *మున్సిపల్ కమిషనర్ పి. శాంతి కుమార్*
- తొర్రూర్ మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నారు. సోమవారం తొర్రూరు పట్టణంలోని పేరుకుపోయిన బకాయి వసూళ్లలో భాగంగా కొన్నింటిని సీజ్ చేశామని డప్పులతో వినూత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2023- 24 సంవత్సరానికి గాను భారీగా పేరుకుపోయిన ఆస్తి పన్ను దారులకు నోటీసులు ఇచ్చి రెండు మూడు రోజులుగా సంబంధిత పేరుకుపోయిన బకాయిదారులకు మౌఖికంగా చెప్తున్నా కానీ ఇంతవరకు టాక్స్ కట్టని సముదాయాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ శాఖ ఆస్తి పన్నుపై అధిక మొత్తంలో పెనాల్టీ పైన 90% మినహాయింపు ఇస్తున్నందున అందరూ ఉపయోగించుకొని పేరుకుపోయిన తమ ఆస్తి పన్నులను 90 శాతం మినయింపుతో సకాలంలో చెల్లించి లబ్ధి పొందాలన్నారు. అలాగే పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కట్ట స్వామి,హెల్త్ అసిస్టెంట్ రాజు,వార్డ్ ఆఫీసర్లు దేవేందర్,పట్టాభి. నవీన్, ఉపేంద్ర, బిల్ కలెక్టర్లు శంకర్, యాకయ్య, సిబ్బంది మురళి,చినబాబు తదితరులు పాల్గొన్నారు.
