ప్రాంతీయం

అధికారుల కాసుల..సన్నుల్లో ఇళ్లపట్టాలు.. పత్తాలేని పై అధికారులు… 

297 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి) కేంద్రంలో గూడు లేని నిరుపేదల కొరకు గతకాంగ్రెస్ ప్రభుత్వం హయంలో 2008 సంవత్సరం సర్వేనెంబర్ 998,999,1001,లలో 13 ఎకరాల ఐదు గుంటల భూమి కొనుగోలు చేసి అధికారికంగా 162 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మిగిలిన ఖాళీ ఇండ్ల స్థలాలను కొంతమంది ఇతర గ్రామాల నుండివచ్చి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన స్పందించక పోవడంతో అక్రమ ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ కాలనీ అడ్డగా మారిందని చింతోజి బాలయ్య అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటీ నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గూడులేని నిరుపేదలకోసం 156 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ముస్తాబాద్ గ్రామానికి చెందిన అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించకుండా ఇతరప్రాంతాల వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎలా పంపిణీ చేస్తారని మండిపడ్డారు. ఇండ్ల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలను తుంగలోతొక్కి అధికారులు తమ ఇస్తారాజ్యంగా కాసుల కాశపడి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని, మిగిలిన ఖాళీ ప్లాట్లను అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా ఆక్రమించుకొని ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులకు పాలకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏముందని అన్నారు.  కొంతమంది ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా తమ చేతివాటం చూపిస్తూ అక్రమ నిర్మాణాలకు తావిస్తూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత పది సంవత్సరాలనుండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులే కాకుండా ఇక్కడ ఓటుహక్కులేని ఇతర ప్రాంతాల వారు ఇండ్ల స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం వెనుక అసలు సూత్రధారులు ఎవరని తెలిసిన మండలంలోని ప్రయాధికారుల ప్రమేయంతోనే ఈ వ్యవహారం నడుస్తుందని ఆరోపించారు. ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంనందున నిండు సభలో ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ప్రస్తావించగా వెంటనే స్పందించిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జనగామ శరత్ రావు అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన నేటి వరకు అక్రమనిర్మాణాల పైనచర్యలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొంతమంది గ్రామ నాయకులు ఆవేదన వ్యక్తం


చేశారు. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రజలు పాలకులు అధికారులు కలసి సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మండలంలో అధికారులు మాత్రం ప్రజా ప్రతినిధుల ఆదేశాలను బేకాతర్ చేయడం ఏమిటని..? ప్రశ్నించారు ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఇందిరమ్మ కాలనీలో జరిగిన అక్రమ ఇళ్లనిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని గ్రామంలో గూడులేని నిరుపేదలను గుర్తించి అధికారికంగా పట్టాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్