ముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి) ఎందరో త్యాగధనుల ఫలితంగా నేడు ప్రజలు స్వేచ్ఛా వాయులు ఆస్వాదిస్తున్నారని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కస్తూరి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా వెంకటరెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత మండల పాత్రిక మిత్రులకు, మండల ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మనస్ఫూర్తిగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల ఫలితమే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తూ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అందుకే వారిని ఎప్పుడూ మనం స్మరించుకోవాలని వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం పారదర్శకతతో ధనిక పేద అనే తేడా లేకుండా ఆప్యాయంగా ఉంటూ అందరినీ సమానంగా ఉండాలని కోరారు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని అన్నారు. జెండాఆవిష్కరణ అనంతరం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, పిల్లల హక్కులు- చదువు, సంక్షేమం తదితతర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం బాలికలను ప్రోత్సహిస్తూ జ్ఞాపికలు, పెన్నులు బుక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఒరగంటి తిరుపతి, సీనియర్ పాత్రికేయులు తడుక లక్ష్మీనారాయణ, రామగౌడ్, బైరి బాలరాజు, కూర సంతోష్, సుంచు బాబు, బరిగెల రమేష్, కొల్లూరి శంకర్, గున్నాల పరుశరాములు గౌడ్, రుద్ర శ్రీనివాస్ చారి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
107 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యా తండా సెస్ ప్రతినిది ఎన్నిక శనివారం గ్రామ సర్పంచ్ గూగులోత్ భారతి శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భూక్య తండా గ్రామ సెస్ ప్రతినిధిగా భూక్య దేవ్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బోయిని లావణ్య వ్యవహరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గుగులోత్ శ్రీరాం నాయక్, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు, సెస్ వినియోగదారులు ,గ్రామ ప్రజలు, పాల్గొన్నారు. Anugula […]
129 Viewsబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్. ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 21, విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వచ్చిన అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేకపోవడం బాధాకరమని […]
62 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం లోని పారుపల్లి గ్రామంలో శ్రీ కలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే డా జి. వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్