మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరగ్రామం, మర్కూకు, మండలం ,నందు గ్రామసర్పంచ్ అచ్చoగారి భాస్కరు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది.
మేడ్చల్18
ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమమునకు, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ లు, గ్రామ ప్రజలు పాల్గొనడము జరిగింది.
ఈ వైద్య శిబిరంలో 110మందికి షుగర్, బీపీ, టెస్టులు చేయడం జరిగినది,ఆపరేషన్ అవసరము ఉన్న వాళ్ళ 30 మందిని రిపర్ రాయడం జరిగింది.వీరిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుంది.
ఈ వైద్య శిభిర కార్యక్రమంలో డాక్టర్లు సామ్రాన్ సింగ్ , యశ్వంత్ కుమార్ ,అబ్దుల్ ,శ్రావ్య , మార్కెటింగ్ ఇంచార్జి కుమార స్వామి , నాగార్జున, అక్ష, పాల్గొనడం జరిగింది.





