దళిత బంధు దళారికి విందు
లబ్ధిదారునికి ఆరు లక్షల 40 వేలు ఇచ్చిన వైనం
బాధితుడు అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్న దళారి
డిసెంబర్ 15
తిరుమలగిరి మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ కు చెందిన కందుకూరి కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందులో తను చెప్పుల షాపుకు కొటేషన్ ఇవ్వగా అతని కొటేషన్ మార్చి దళారి తుమ్మ బిక్షం అతని కొడుకు కలిసి నీ కిరాణం షాప్ మంజూరు అయిందని చెప్పి ఆరు లక్షల 40 వేల రూపాయలు చెక్కు ఇచ్చి మిగిలిన డబ్బులు ఏవి అంటే ఇవ్వను జీఎస్టీ కట్టాను నీకు అంతే వస్తాయని చెప్పారు లేదు నాకు ఇంకా డబ్బులు వస్తాయని అడిగితే ఇవ్వను నీకు దిక్కున చోట చెప్పుకోమని బెదిరించారు దీనిపై జిల్లా అధికారులు విచారణ జరిపి నాకు రావలసినటువంటి మిగతా డబ్బులు ఇప్పించగలరని బాధితుడు వాపోయాడు ఇలా దళిత బందులో ఎన్ని కంప్లైంట్లు వచ్చినా సంబంధిత అధికారులు నెమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని ఇకనైనా కళ్ళు తెరిచి బాధితులకు తగు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు





