ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం
పార్టీ నేతలకు కెటిఆర్ సూచన
డిసెంబర్ 14
హైదరాబాద్:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్ఎలు, ఆ పార్టీ నేతలతో నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహిస్తామని వెల్లడిం చారు.
నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, నేడు ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని కెటిఆర్ తెలిపారు.
ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకొని, ఓటమికి గల కారణాలను లోతుగా.విశ్లేషించుకుంటామని తెలిపారు.అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు, కార్య కర్తలు ఎటువంటి నిరాశ పడొద్దని, ఇది పార్టీకి తాత్కాలికి బ్రేక్ మాత్ర మేనని ధైర్యం చెప్పారు.ఈ అయిదేళ్లలో 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలియజేశారు
