Breaking News

నేటి నుంచి ప్రజావాణి…

206 Views

హైదరాబాద్ డిసెంబర్ 11 : నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీల స్వీకరణ… ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు..

రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపారు. దీంతో నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలను స్థానిక అధికారులకు చెప్పుకునే అవకాశం ఏర్పడింది..

ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాలని, ముఖ్యంగా జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి..

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *