దౌల్తాబాద్: కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 11న సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆది శివరాములు తెలిపారు. ఉదయం పది గంటలకు సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమవుతాయని, ఈ వ్రతాల్లో పాల్గొనేందుకు దౌల్తాబాద్, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సత్యనారాయణ వ్రతం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.




