వడ్లు కట్టింగ్ లేకుండా కొనుగోలు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘనాథ్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలంలోని కన్నెపల్లి, గూడెం, రంగపల్లి గ్రామాలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.
కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ ప్రకటించి మానిఫెస్టో లో అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా రూపొందించడం జరిగింది అని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని రఘునాథ్ గారు తెలిపారు.
