రాజకీయం

గడ్డ వివేక్ నివాసంలో మీడియా సమావేశం

258 Views

మంచిర్యాల లోని తన నివాసంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశం.

వివేక్ వెంకటస్వామి కామెంట్స్

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చుతాం రూ.15 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం. సింగరేణి లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు కు కృషి చేస్తాము.సింగరేణి నుండి నేరుగా మెడికల్ రెఫరల్ హైదరాబాద్ కు వెళ్ళడానికి వీలుగా ప్రణాళిక రెడీ చేస్తాము.

కాంగ్రెస్ పార్టీలో ఉచిత కరెంట్ అన్నారు ఇచ్చారు వడ్డీలేని రుణం కూడా ఇచ్చారు ఇప్పుడు మ్యానిఫెస్టో లో పెట్టిన ప్రతి అంశం కార్యాచరణలో ఉంటది.

85 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవనుంది సర్వేలు చెప్తున్నాయి.అవినీతిలో బి ఆర్ ఎస్ కూరుకుపోయింది. ఎన్నికల సమయాల్లో ఇంటి ఇంటికి నల్ల నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగను అన్నాడు.

చెన్నూరు లో ఎక్కడ చూసినా నీళ్ల సమస్య ఉంది అవ్వే నా దృష్టికి తెచ్చారు.

కాంగ్రెస్ పార్టీ గెలవనుంది ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేస్తున్నాము.

ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని అది ఇది అంటున్నాడు అన్ని అబద్ధాలే

లాక్షా యాభై ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ హయంలో వచ్చాయి రాజీవ్ ఆరోగ్య పథకం 2 లక్షలు ఉండే 10 లక్షలు పెంచారు.

రైతును కోటీశ్వరుడిని చేస్తా అన్నాడు ఆయనే కోటీశ్వరుడు అయ్యాడు.

కేసీఆర్ ను 10 సంవత్సరాలు నమ్ముకున్న కేవలం తన కుటుంబంను బంగారు కుటుంబ చేసుకున్నాడు.

చెన్నూరు ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాము.

జనం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల వైపే ఉన్నారు.

నిన్న భిమారం లో విశేష స్పందన వచ్చింది 6 వేల మంది జనం సభలో హాజరయ్యారు.

బాల్క సుమన్ చెన్నూరు ప్రాంతాల్లో తిరగలేదు సమస్యలు తీర్చలేదు.

అధికారంలో ఉన్న లేకున్నా నా ట్రస్ట్ నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాను.

చెన్నూరు ప్రజలు ఇప్పటి వరకు బాల్క సుమన్ ను చూడలేదని నాతో చాలా మంది అన్నారు.

ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి అబద్దాలు చెప్తుండు.

సింగరేణి ప్రైవేటీకరణ తీస్కొచినవ్యక్తుల్లో బాల్క సుమన్ కూడా ఉన్నారు

పార్లమెంట్ లో 13 మంది  టిఆర్ఎస్ ఎంపీ లు బిల్లుని ఆమోదం తెలిపారు.

తెలంగాణ లో  టిఆర్ఎస్ కు కేవలం 20 సీట్లు మాత్రమే వస్తాయి

ఓటమి భయం తో కేసీఆర్ ఇది4 పడితే అది మాట్లాడు తున్నారు.

తుగ్లక్ ముఖ్యమంత్రి కాళేశ్వర్ కటిండు,పుస్తకాలు చదివి ఎవడైన ప్రాజెక్టు కడతార!వాస్తవానికి సీఎం కేసీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలి అప్పుడే నిజాలు వస్తాయి.

70 -80 కోట్లు మిషిన్ భగీరథ నుండి లూటీ చేసిండు.

బిజెపి, బి ఆర్ ఎస్ ఇద్దరు ఒకటే కలసి ఉన్నారు కాబట్టి పార్టీని వీడి కాంగ్రెస్ కి వచ్చాను.

బీజేపీ మ్యానిఫెస్టో మెంబర్ గా ఉన్న మ్యానిఫెస్టో లో మంచి అంశాలు ఉండే

కవిత అరెస్ట్ అంశం కూడా మ్యానిఫెస్టోలో ఉండే,బిజెపి కేసీఆర్ చెప్పుచేతుల్లో ఉంది.

నా మీద fema, ఫెరా వైలేషన్స్ ఉన్నాయి అని తప్పుడు ప్రెస్ నోట్ విడుదల చేశారు.

కాళేశ్వరం, మిషిన్ భగీరథ అవినీతిపై బిజెపి కి ఫిర్యాదు ఇచ్చిన ఇన్నాళ్లు చర్యలు లేవు.

నేను పార్టీ మారిన 5 వ రోజునే సోదాలు జరిపారు.10వేల కోట్ల రూపాయలు టాక్స్ కట్టిన నా సంస్థలు అన్ని లీగల్నీ, నిజాయితీ గా ఉండే వ్యక్తిని నేను.

ఎన్ని సోదాలు చేసిన నా దగ్గర ఇల్లిగల్ ఎమ్ లేవు.

విజిలెన్స్ సంస్థ నుండి 9 కోట్లు ప్రభుత్వం కు పన్ను కట్టాము ఈ విషయం అధికారులు చెప్పలేదు.

విజిలెన్స్ సంస్థ నుండి లోన్స్ తీస్కున్నాను చట్టం ప్రకారమే లావాదేవీలు జరిగాయి.

విజిలెన్స్ సంస్థ పై తప్పుడు ఆరోపణలు చేసిన దర్యాప్తు అధికారులపై పరువు నష్టం దావా కేసు వేస్తాను.

ఎంపీ గా ఉన్నపుడు 14 కోట్లతో చెన్నూర్ లో మంచి నీటి సరఫరా పథకం తెచ్చాను.

మందమర్రి రామకృష్ణాపురం  కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్న అభివృద్దే ఇప్పటికి ఉంది

ఎంపీ గా ఉన్నప్పుడు రెండు రైల్వే బ్రిడ్జి లని సాంక్షన్ చేయించాను.

బాల్క సుమన్  ఎంపీ, ఎమ్మెల్యే గా ఉన్న ప్రజలకు చేసింది ఏమి లేదు.

బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే కవిత, కేసీఆర్, సంతోష్ రావ్ పై రెయిడ్స్ చేయాలి.

ప్రైవేటీకరణ కు కాంగ్రెస్ పార్టీ అని ఎట్లా చెప్తారు  టిఆర్ఎస్, బిజెపి కారణం అని మేము ఎక్కడైనా నిరూపించడానికి సిద్ధం.

సింగరేణి బకాయిలు కేసీఆర్ తన స్వలాభం కోసం వాడుకున్నది నిజం కాదా.?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారసత్వ నియామకాలు చేశారు దానికి కాంగ్రెస్ ను ఎందుకు బద్నాం చేస్తారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *