రాంపూర్ లో 25న శివలింగ ప్రతిష్ట మహోత్సవం
నవంబర్ 21
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో ఈ నెల 25న శివలింగ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శెట్టె కవిత-యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ నుంచి పూజ కార్యక్రమాలు జరుగుతాయని అందుకు ఈ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే 24,25వ తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు… ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.





