ముస్తాబాద్, న
వంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) మండలంలో అధికార పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడం మండల వ్యాప్తంగా గులాబి శ్రేణులు నెలకొనడంతో వ్యూహాలకు పదును పెట్టి మండల నాయకత్వాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి ప్రతి గడపగడపకు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మెనీ పోస్టోలొ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ అందులో భాగంగానే అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమన్వయ కార్యకర్తలను నియమించారని తెలుస్తుంది. ఈ కారణంగానే పార్టీ ఇన్చార్జీలు చేపడుతున్న కార్యక్రమాలను సమన్వయంతో ఒక తాటిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి హోరా హోరీగా దూకుడు పెంచాయి. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు సంతోష్ రావు కీలకంగా వ్యవహరించి బిఆర్ఎస్ నాయకులను చెదిరిపోకుండా బలపరుస్తూ ముందుకు సాగిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.




