ముస్తాబాద్, నవంబర్ 16 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామానికి చెందిన జిల్లా బాయిలర్ పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షులు (మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్) బొందుగుల దేవరెడ్డి అసంతృప్తితో బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూడికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి సొంత వ్యవసాయ పనులు వదులుకొని బిఆర్ఎస్ పార్టీలో సాయశక్తుల నిస్వార్థ సేవకుడిగా పనిచేస్తున్న సేవలను కనుమరుగై గుర్తింపును పొందలేని నేను కక్కలేక మింగలేక మనసును చంపుకోలేక పార్టీ నుండి వెళ్దామని నిర్ణయించుకు న్నానని అన్నారు. నాతోపాటు మరి కొందరు కూడా ఉన్నకానీ వారు మనసు చంపుకొని ఉంటున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీని నుంచి తొలగి జిల్లా సమీపంలోనికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కండువా వేసుకున్నాను అని తెలిపారు.




