నవంబర్ 14
సిద్దిపేట జిల్లా, ములుగు మండల కేంద్రమైన ములుగు గ్రామానికి చెందిన దూసరి భాస్కర్ గౌడ్ అనే వ్యక్తికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అతనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షుడు, ఏజెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మహమ్మద్ జుబేర్ పాషా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. పూర్తి ఆపరేషన్ కి సంబంధించిన డబ్బులు తన లీడర్లతో చెప్పి సహాయం చేపిస్తానని హామీ ఇచ్చారు.
