మంత్రి కేటీఆర్ అధిక మెజారిటీతో గెలవాలని 108 దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణపురం గ్రామవాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సీతారామస్వామి ఆలయంలో 108 దీపాలతో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆలయం లోపల సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి అభ్యర్థి తారక రామారావు అధిక మెజారిటీతో గెలవాలని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ఎల్సాని మోహన్, గ్రామ సర్పంచ్ నిమ్మ లక్ష్మి,లింగాల నరేందర్,ఎండి మాజీద్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, పిల్లి కిషన్, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




