బెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ రోజు బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.”పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.
