ముస్తాబాద్/అక్టోబర్/11; అక్రమంగా నిల్వఉంచిన పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ పోర్స్ పోలీసులు ముగ్గురు అరెస్టు …90 క్వింటాళ్ల పిడియస్ రైస్ స్వాధీనం ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో అక్రమంగా నిల్వఉంచిన 90 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం, స్వాధీన పరుచుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం నిందితులను పిడిఎస్ రైస్ ను ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నిందితులు మోతే రాములు, తండ్రి దుర్గయ్య, 45. సం. స్వాధీన పరుచుకున్నవి 90, క్వింటాళ్ల పిడిఎస్ రైస్ మొత్తం ముగ్గురు నిదితులు ఇట్టి టాస్క్ లో ఎస్సై ఎం.మారుతి, హెడ్ కానిస్టేబుల్ మారుపతి, షబ్బీర్, శ్రీనివాస్ కానిస్టేబుల్ – శ్రీనివాస్, అక్షర్ మహిపాల్, ప్రశాంత్. పాల్గొన్నారు.
