దేవీ నవరాత్రోత్సవాలలో ఇంద్రజాల ప్రదర్శన
అక్టోబర్ 22
సిద్దిపేట జిల్లాలోని ఇమాంబాద్ గ్రామంలో హిందు వాహిని , కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
దేవిని వివిధ పూలతో అందంగా అలంకరించి, మహిళలు దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మిమిక్రీ వై. రమేష్ తన మ్యాజిక్ ద్వారా అందర్నీ ఆలోచింపజేశాడు. వెంట్రిలాక్విజంతో నవ్వులు పువ్వులు పూయిoచారు. పిల్లలకు , పెద్దలందరికీ గేమ్స్ నిర్వహించి అందులో గెలుపొందిన కి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా తన ప్రదర్శన విజయవంతం చేసినందుకు వాటికి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.





