బీజేపీ మండల, పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం కడారి అశోక్ రావ్, ఎల్లంకి రాజు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కాయమని, ప్రతి కార్యకర్త ప్రతిష్ణత్మకంగా తీసుకొని పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మీస అర్జునరావు, సౌదరి మహేందర్, కొమ్ము తిరుపతి యాదవ్, మైపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఆదికేశవరావు తదితరులు పాల్గొన్నారు.
