ముస్తాబాద్, అక్టోబర్ 17, మండలంలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం ఉదృతంగా సాగుతుంది ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి తనదైన శైలిలో అధికారపక్షంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కంటే ముందు వరసలో ఉంటూ ఇప్పటికే ఒక దశ ప్రచారం ముగింపు దశలో ఉంది ప్రతి గ్రామంలో అందరినీ కలుపుకుంటూ ప్రజలతో మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజలు కూడా అదే తరహాలో స్పందిస్తూ అభినందిస్తు మద్దతు తెలియజేస్తున్నారు.
గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉదృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన గత తొమ్మిదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూమ్ లు లేవు దళిత ముఖ్యమంత్రి లేడు. దళితులకు మూడెకరాల భూమి లేదు అన్నారు. నిరుద్యోగులకు కన్నీళ్లే మిగిలాయి రైతులకు ఆత్మహత్యలే శరణo అయినాయి అన్నారు. ఇన్ని రోజులు మోసం చేసింది చాలదు అంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టడం కేసీఆర్ దిగజారుడు తరానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ వి అమలు కానీ హామీలు అని చెప్పి అదే హామీలను కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అర్థమై ఎలాగోలా మోసం చేద్దాము అనుకుంటున్నారని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి సన్నద్దులై ఉన్నారు. దీన్ని ఎవరూ ఎన్ని కుయుక్తులు పన్నినా ఆగదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడం తద్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళలకు 2500 రూపాయలు ఇస్తాము అన్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తాము అన్నారు. రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాము మరియు 15 వేల రూపాయల పెట్టుబడి సాయం ఇస్తాము అన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తాము అన్నారు. రైతు కూలీలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు అందిస్తాము అన్నారు. వృద్ధులకు ఆసరా పెన్షన్లు 4000 రూపాయలు ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తామన్నారు. అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాము అన్నారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇంటికి రూపాయలు ఐదు లక్షల సహాయం చేస్తాము అన్నారు. మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స మరియు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందిస్తాము అన్నారు. యువ వికాసం పేరిట విద్యార్థులకు 5 లక్షల విద్యాభరోసా కార్డు మరియు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాము అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబితే చేస్తుంది అన్నారు. మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, సీనియర్ నాయకులు అరుట్ల మహేష్ రెడ్డి, వేముల సత్యం గౌడ్, ఉచ్చిడి బాల్ రెడ్డి, తాడేపు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
