డ్రోన్ సహాయంతో పంటలకు మందుల పిచికారి
-షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ” ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
అక్టోబర్ 15
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామంలో మనుషుల ద్వారా కాకుండా ఆధునిక పరికరమైన డ్రోన్ సహాయంతో వరి,మరియు పత్తి, మిరప, కంది, ” శివశక్తి గ్రూప్ ఆఫ్” కంపెనీ అయినటువంటి “షణ్ముఖ అగ్రిటెక్” ఆధ్వర్యంలో వ్యవసాయానికి సంబంధించిన ఈ డ్రోన్ సహాయంతో మంగళపల్లి గ్రామంలో మూడు ఎకరాల వరి పంటకు ఎకరానికి 12 లీటర్ల తో మందు సరిపోతుంది.
ఈ సందర్భంగా కంపెనీ రీజినల్ మేనేజర్ ” గుండ్ల స్వామి”మాట్లాడుతూ….డ్రోన్ టెక్నాలజీ ద్వారా మీకు సమయం, మందు,లేబర్,కలిసి వస్తుందని తెలిపారు.గ్రామ సర్పంచి వెల్మ నాగిరెడ్డి,వి.తిరుపతిరెడ్డి పొలంలో పురుగుమందులను పిచికారి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని సీనియర్లు ఎ ఎస్ ఎం ఎస్.శ్రీనివాస్,ఎస్ ఓ కె.శ్రీనివాస్ , కోట నరేష్, కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్లు మహేందర్,,ప్రసాద్, శ్రీనివాస్,తిరుమల్ , ఆంజనేయులు, రాకేష్, డెమోలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు మరియు డీలర్లు పాల్గొన్నారు
