రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా 6 గ్యారంటీ పథకాల ప్రచారం కరపత్రాల ద్వారా నిర్వహించారు.బుదవారం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు.
మహిళల కు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు అందే సంక్షేమ పథకాలను వారు వివరించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే పథకాలను ప్రజలకు వివరించారు.
కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పందిర్ల లింగం గౌడ్, బుచ్చిలింగం సంతోష్ గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, గంట అంజయ్య గౌడ్ ,గంట స్వామి గౌడ్, తదితరులు ఉన్నారు.




