అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది.
ఈ నెల 15న హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
ఆ తర్వాత 16వ తేదీ నుంచి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు.






