సిద్దిపేట జిల్లా అక్టోబర్ 8
24/7 తెలుగు న్యూస్
మర్కూక్ మండల కేంద్రానికి చెందిన తులసి లక్ష్మి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.తన వంతు సాయంగా రూ.4000 నగదు సాయాన్ని అందించారు. ఆయన వెంట వార్డు సభ్యులు సుగుణ కిషోర్,సీనియర్ నాయకులు స్వామి శ్రీను తదితరులు ఉన్నారు.
