అక్టోబర్ 4 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్:
చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్రం బస్టాండ్ ఏరియా చెరువు కట్టవద్ద నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోట శ్రీలత అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ఈరోజు జరిగే ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీ ల రైస్ మరియ 10 కేజీ ల చికెన్ పంపించగ దుర్గం అశోక్ యువసేన సభ్యులు దుర్గం కపిల్ దేవ్, కోట రాజం, సెగ్గెం శెంకర్, సెగ్గెం రాజం, జాడి పోషం, తగురం మల్లయ్య, మరియు గ్రామస్థులు దుర్గం రాజు, గార్లు మృతురాలు ఇంటికి వెల్లి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
అది చూసిన అక్కడి ప్రజలు ఏపదవి లేకుండానే ఇలా వేలమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మనసున్న సేవకుడే నాయకుడు ఐతే ఇంకా వేలమంది పేద మధ్యతగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది కనుక ప్రజలతో సంబందం లేని ఏవ్యక్తిని కూడ వేరే నియోజకవర్గాల్లో గెలిపించనే గెలిపించరు కనుక మనం కూడ ఇక్కడ? ఎవరో ముక్కు మొహం తెలియని వారిని కాకుండా, అందరికి అందుబాటులొ ఉంటూ సౌమ్యంగా మాట్లాడుతూ, కోపతపాలు బెదిరింపులు లేకుండా మనకుటుంబంలో మనలో ఒకడిగా కలసి ఉంటున్న దుర్గం అశోక్ నే ఎమ్మెల్యే గెలిపించు కోవాలని చర్చించు కుంటున్నారు.
అనంతరం మృతురాలు సోదరుడు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ మాకుటుంబ పరిస్థితి గురించి స్థానికులు చెప్పిన వెంటనే స్పందించి సహయం అందించిన దుర్గం అశోక్ కి మా కృతజ్ఞతలు అని తెలియజేశారు.
