ప్రాంతీయం

మంచిర్యాలజిల్లా నిల్వాయిలో పెద్ద పులి

274 Views

అక్టోబర్ 04 మంచిర్యాల జిల్లా
వేములపల్లి మండలం నిల్వాయిగ్రామం లోబుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది.

గ్రామంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం ఉదయం పులి ఆవు, దూడ మీద దాడి చేసినట్లుగా గుర్తించిన గ్రామ‌స్తులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంట‌రిగా బ‌య‌ట‌కు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

వీలైనంత తొందరగా పులిని పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *