తొగుట: అక్టోబర్ 1
24/7 తెలుగు న్యూస్
రైతులు తమకు కావలసిన వ్యవసాయ ఉత్పత్తులు తమకు తామే ఉత్పత్తి చేసుకోవడంతో పాటు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని ఏకలవ్య ఫౌండేషన్ సీఈవో మధుకర్ పేర్కొన్నారు. తొగుట మండలం వెంకట్రావుపేటలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ మహాసభ సమావేశం చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి అధ్యక్షత నిర్వహించారు. శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.





