-మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
(తిమ్మాపూర్ సెప్టెంబర్ 28)
దళితుల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు.బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలోని దళిత సంఘాల నాయకులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తమ గ్రామంలో డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు..
అనంతరం బీఆర్ఎస్ పార్టి బెజ్జంకి మండల ఉపాధ్యక్షుడిగా వీరాపూర్ గ్రామానికి చిలుముల దేవదాస్ ని నియమిస్తూ ఉత్తర్వుల పత్రాన్ని ఎమ్మెల్యే రసమయ అందజేశారు..




