గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సెప్టెంబర్ 25
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బీసీ కాలనీలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో సోమవారం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సేవరత్న అవార్డ్ గ్రహీత బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ దంపతులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన మహా గణపతి మండపం అత్యంత అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని వినాయకుణ్ణి పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మహేష్,ప్రభాకర్,రాజు,అనిల్, కరుణాకర్,శేఖర్,శ్రీకాంత్, దుర్గేష్, స్వామి,ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు





