దుబ్బాక: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్త పల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొద్దీ రోజులుగా కడుపునొప్పి తో బాధ పడుతూ పలు ప్రయివేట్ ఆసుపత్రి లకు తిరిగిన నొప్పి తగ్గక పోవడం తో మూడు రోజుల క్రితం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ హేమరాజ్ సింగ్, వైద్య బృందం ఆధ్వర్యంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పెద్ద లార్జ్ పైబ్రేయిడ్ గడ్డ ఉందని నిర్దారింఛి గురువారం ఆపరేషన్ చేయగా సుమారు 5 కిలోల 400గ్రాముల పైబ్రాయిడ్ కణితినీ ఆపరేషన్ చేసిన తొలగించడం జరిగింది అని డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. పేషేంట్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. పెషేంట్ బంధువులు సిబ్బందికీ కృతజ్ఞతలు తెలిపారు…




