జిల్లా వ్యవసాయ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు
ములుగు జిల్లా, సెప్టెంబర్ 21
ములుగు జిల్లా కేంద్రంలో నూతన ములుగు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బడే నాగజ్యోతి,టిస్ రెడ్కో చైర్మన్ ఎర్వ సతీష్ రెడ్డి,కాకులమర్రి లక్ష్మణ్ బాబుతో కలసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ములుగు ఇంచార్జి మంత్రి,రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.నూతన భవనంలో జిల్లా వ్యవసాయ అధికారిని వారి ఛాంబర్ లో ఆశీనులు చేసి వారికి అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.వీరి వెంట అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు,ప్రజలు ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో వచ్చిన వ్యవసాయ కార్యాలయంను వినియోగించుకోవాలని కోరారు.




