దౌల్తాబాద్: దుబ్బాక పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, చేర్వాపూర్ ప్రాథమిక పాఠశాల, లచ్చపేట ఆదర్శ పాఠశాల, ఉన్నత , ప్రాథమిక పాఠశాల లో పి ఆర్ టి యు టి ఎస్ దుబ్బాక అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ సేకరణ పిఆర్టియుటిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మల్లు గారి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 5 వరకు ఉపాధ్యాయులందరి బదిలీలు, పదోన్నతులు పూర్తవుతాయని త్వరలోనే పిఆర్సి కమిటీ వేసి మధ్యంతర భృతి కూడా ప్రకటించడం జరుగుతుందని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక అర్బన్ అధ్యక్షుడు గాజుల రామచంద్రం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అనిల్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జనార్ధన చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు




