Breaking News

విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

101 Views

గాంధీనగర్ లో గాంధీజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

సర్పంచ్ కేసరి శంకర్

సెప్టెంబర్ 20

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నూతన తడ్కల్ మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలోని ప్రధాన కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణానికి బుధవారం గ్రామ సర్పంచ్ కేసరి శంకర్, భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి కోటా లలిత ఆంజనేయులు,ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్క గంగారం,ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ రుక్మిణి బాయి అంబాజీ,తో కలిసి జాతిపిత మాత్మ గాంధీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత ప్రపంచ దేశాలకు సత్యమేవ జయతే శాంతి తత్వాన్ని తెలియజేసిన మహానీయుడు అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో అంజయ్య చారి,శంకర్, హనుమాడ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *