
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శనివారం రాగుల కిష్టయ్య తండ్రి వరదయ్య చెరువులోకి స్నానం చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందడం జరిగింది. మృతునికి భార్య లలిత, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. వరదయ్య మృతితో కుటుంబములో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.




