Breaking News

ఐటీడీఏ ముట్టడి హెచ్చరిక

247 Views

 

రాజ్యాంగ బద్ద జీవో లను కుని చేస్తున్న ఉన్నత అధికారులు

 

ఏఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ డిమాండ్

 

ములుగు జిల్లా, ఏటూరునాగారం,సెప్టెంబర్

 

ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి చందా మహేష్ ఏర్పా టు చేసిన సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ పాలుగోని ఐటీడీఏ పి ఓ జీవో నెం 3 ని అమలు చేయటం లేదని ఐఏఎస్ అధికారి ఐటీడీఏ పీవో గా ఉన్న కాని ఆదివాసీల రాజ్యాంగ బద్ధమైన జీవో లు అమలు చేయక పోవడం గిరిజన చట్టాలు జీవో లమీద సరైన అవగాహన లేకపోవటమే ప్రధాన కారణమని అన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)జీవో 3 ని కొట్టి వేయలేదని 50% నికి మించ కూడదనే స్పష్టంగా చెప్పిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులు జీవో 3 ని అమలు చేయకపోటం బాధాకరమని సుప్రీంకోర్టు ఇచ్చిన 50% ఆర్డర్ మీద పిటిషన్ దాఖలు చేశా మని మరల సుప్రీంకోర్టు జడ్జి మెంట్ ఇచ్చేంత వరకు జీవో 3 ని కచ్చితంగా అమలు చేయా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నత అధికారుల మీద ఉన్నదని అన్నారు.జీవో 3ని అమలు చేయకపోవటం వల్ల ఆదివాసీలు ఉద్యోగ అవ కాశాలు ప్రస్తుత ఉపాద్యా యులు ప్రమోషన్ ట్రాన్స్ఫా ర్మర్స్ ఆగిపోయాయని మైదాన ప్రాంతాల్లోని ఉపాద్యాయులను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీలు చేస్తున్నారని దినికరణంగా భవి ష్యత్ తరాల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరు గుతుందని ప్రభుత్వం ఐటీడీఏ పీవో మీద తన హాసహనాన్ని వ్యక్త పరిచారు ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో జీవో 3 ని అమలు చేయకపోతే 5000 వేల మందితో ఆదివాసీ వి ద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడికి పిలుని స్తామని పత్రిక ముకంగా ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ భూపోరాట కమిటి రాష్ట్ర నాయకులు పొడుగు రామారావు,నాయకులు కొటే శంతోష్,మొదలగు వారు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *