గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 12 తెలుగు 24/7న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఠాణా దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విచ్చేసి గంభీరావుపేట మండల ప్రజలు ఈ కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా శాంతి భద్రతల ను పరిరక్షించడం పోలీస్ శాఖ కీలకంగా వ్యవరిస్తుంది అని సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడం కోసం చేపట్టిన ఠాణా దివస్ కార్యక్రమం లో భాగంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో అందుబాటులో మండలప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను గ్రామాల్లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారుగంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఠాణా దివస్ లో ప్రజల వద్ద నుండి 50పిర్యాదులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వీకరించారు. ప్రజలకు మరింత చేరువగా పోలిసింగ్ వెళ్ళడానికి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమంన్ని ప్రతి నెల మొదటి వారం లో పోలీస్ స్టేషన్ లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించునున్నారు ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ శాఖ సిబ్బందిమండలం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




