బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు పంపిణీ
భిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఎల్లవేళల అండగా ఉంటాడని పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందె పోశయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అతనికి రూ 2 లక్షలు విలువ గల బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పొందింది. ఆ చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎంపీపీ రేణుక, జడ్పిటిసి లక్ష్మణరావుతో కలిసి శనివారం పంపిణీ చేశారు.





