ముస్తాబాద్, సెప్టెంబర్1, గూడెంగ్రామ గౌడసంఘం సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొనీ ఎన్నికలు జరిపారు. అధ్యక్షులు పరకాల అంజయ్య, ఉపాధ్యక్షులు లింగంపెల్లి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరె ఎల్లం, కోశాధికారి కోలశ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఇడుగురాల దేవయ్య, కార్యవర్గ సభ్యులు ముస్తాబాద్ లక్ష్మీపతి గౌడ్, కొమిరె పర్శరాములు, కొత్త పర్శరాములు, ఇడుగురాల అంజయ్య,లను గౌడ కుటుంబ సభ్యులు వివిధ హోదాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.




