మాజీ మంత్రి వర్యులు తుమ్మల గారిని కలిసిన బొమ్మెర ఈ రోజు గండుగులపల్లి లోని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్గీయులు తుమ్మల నాగేశ్వరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహం నందు కలిసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారి ప్రసాదం అందజేసి శాలువతో సత్కరించారు. అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి మధిర నుంచి పోటీ చేస్తున్న నాకు తమరి ఆశ్శీస్సులు తమపై ఉండాలని కోరిన బిఆర్ ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామమూర్తి గారు. ఈ కార్యక్రమంలో పెద్దగోపవరం సర్పంచ్ ఇనపనూరి శివాజీ గారు, జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిల్లపాటి బాబురావు గారు, జాగృతి మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ గారు, బొమ్మెర సేవాధలం నాయకులు చేకూరి నరేష్ గారు, వేల్పుల అరవింద్ గారు ఉన్నారు.





