Breaking News

అక్టోబర్ 4న జరిగే దళిత ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి  – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలువు

289 Views

 

 

దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల సమస్యల పరిష్కారానికై అక్టోబర్ 4న హైదరాబాదులో లక్ష మందితో తల పెట్టిన దళిత ఉపకులాల ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ విచ్చేస్తున్నారని అత్యంత వెనుకబడిన ఉపకులాల వాదాన్ని బలంగా వినిపించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపకులాల ప్రజలు మేధావులు, నాయకులు, కవులు, కళాకారులు పార్టీలకు, సంఘాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని జక్రియ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు గడ్డం చిరంజీవి చిందు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం లో 22 లక్షల జనాభా కలిగిన ఎస్సీలలో ఉన్న ఉపకులాలు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి కూడా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ పరంగా తీవ్ర అన్యాయానికి గురైతున్నారని. ఈ కులాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని కనీసం కుల దృవీకరణ పత్రాలు కూడా సకాలంలో పొందలేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలలో అన్ని రాజకీయ పార్టీలు దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని, కులధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ దళిత్ డిక్లరేషన్ లో ఉపకులాలకు 750 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాడాన్ని స్వాగతిస్తూ దాన్ని రెండువేల కోట్లతో ఏర్పాటు చేయాలని, అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ ఏం బి ఎస్ సి లుగా గుర్తించాలని డిమాండ్ చేసారు. ఎస్సీ వర్గీకరణ లో ఎస్సీ 57 ఉపకులాలను A వర్గం లో చేర్చి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కేటాయించేవిధంగా ఎస్సీ వర్గీకరణపై స్పష్టత నివ్వాలని అన్ని రాజకీయ పక్షలను డిమాండ్ చేసారు. దళిత ఉపకులాల సమస్యల పరిష్కారానికై మద్దతునిచ్చే దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాలను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టి. యన్. స్వామి మిత అయ్యాల్వర్, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, ఆదిమూళ్ల వెంకటేష్ హెలియదాసరి, డి.రంగన్న మాదసికురువ, ఎత్తపు కేశవులు బ్యాగరి, తులసిదాస్ గైక్వాడ్ మాంగ్, కర్నె రామారావు డక్కలి, మటపతి నాగయ్య బేడజంగం, దంతెనపల్లి ధర్మయ్య మాస్టిన్, సిరిపాటి వేణు ఆంధ్రప్రదేశ్ నుండి పెద్దయ్య మదాసి కురువ, యెషపోగు బాబు డక్కలి, సీజె శివయ్య మదాసి కురువ, నరేంద్రనాథ్ మాదిగదాసు, తిరుకోవెల బిక్షపతి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్, హరిబాబు, లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *